నూనె వేడి చేసి అందులో వేరు సెనగగుండ్లు వేసి చిట్లనివ్వాలి. చిట్లుతున్న పప్పులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి.
మెత్తబడ్డ ఉల్లిపాయలో టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపి మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి.
మెత్తగా మగ్గిన వీటిని మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
కూర కోసం నూనె వేడి చేసి అందులో చెక్కుతీసుకున్న దుంప ముక్కలు కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలిపి మూతపెట్టి లేత బంగారు రంగు వచ్చే దాకా వేపుకోవాలి.
వేగిన దుంపల్లో ఒక కాప్సికం పెద్ద ముక్కలు, ఉల్లిపాయ పాయలుగా తరుకున్నది వేసి 2-3 నిమిషాలు వేపితే చాలు.
తరువాత వేరుశెనగ పేస్ట్ నీళ్లు కారం వేసి కలిపి 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడనివ్వాలి. దింపే ముందు కాస్త గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.