నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు జీలకర్ర వేసి మెంతులు ఎర్రగా బడే దాకా వేపుకోవాలి తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లులి, ఇంగువ వేసి వేపుకోవాలి.
తాలింపు వేగాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడి నూనె పైకి తేలేదాక దాకా వేపుకోవాలి.
ఉడికిన కాకరకాయ ముక్కలు వేసి 3-4 నిమిషాలు తాళింపులో వేగనివ్వాలి, వేగిన తరువాత నచ్చితే కాకరకాయ ఉడికించిన నీళ్ళు పోసుకోండి, చేదు తినలేరు అనుకుంటే మంచి నీళ్ళు 300ml, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు వేసి 15 నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనివ్వాలి.
పులుసు చిక్కబడ్డాక శెనగపిండి లో ½ కప్పు నీళ్ళు పోసి గడ్డలు లేకుండా కలిపి పులుసులో పోసి బాగా కలిపి మరో 10 నిమిషాలు ఉడికిస్తే పులుసు చిక్కబడుతుంది అప్పుడు దింపేసుకోండి.