పొట్టు మినపప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి, అప్పుడే మాంచి సువాసనా రుచి పులగంకి
కుక్కర్లో కడిగిన బియ్యం వేపిన మినపప్పు మిగిలిన సామాగ్రీ అంతా వేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసుకోండి. మినపగుండ్లు వాడితే మరో విజిల్ ఎక్కువగా రానివ్వాలి.
తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు సామాగ్రీ వేసి ఎర్రగా వేపి పులగంలో కలిపేయండి, ఆఖరుగా కొబ్బరి తురుము వేసి కలుపుకోండి.
ఈ పులగం వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.