మిక్సీలో పచ్చిమిర్చి కొబ్బరి వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
నూనె వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు సెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోండి, తరువాత కరివేపాకు వేసి వేపండి.
వేగిన తాలింపులో ఉడికించున్న వంకాయ ముక్కలు, నానబెట్టుకున్న కందిపప్పు వేసి కలిపి 3 నిమిషాలు మగ్గనివ్వాలి
మూడు నిమిషాల తరువాత పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉప్పు వేసి కలిపి కందిపప్పు మెత్తబడే దాకా ఉడికించుకోండి. (మధ్య మధ్యన కలుపుతుండాలి లేదంటే అడుగుపెట్టేస్తుంది)
దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. ఈ కూర వేడి అన్నం నెయ్యి కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుంది.