క్యాబేజీ మీడియం సైజు తరుగుని 8-10 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకోండి
నూనె వేడి చేసి ధనియాలు, కందిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లులి జీలకర్ర వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేపుకోండి.
వేపుకున్న పప్పుని, కొబ్బరి, నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి.
మిగిలిన నూనెలో ఆవిరి మీద మగ్గిన క్యాబేజీ తరుగు వేసి కాస్త రంగు మారేదాకా వేపుకుంటే క్యాబేజీకున్న పసరు వాసన పూర్తిగా పోతుంది. అప్పుడు తీసి పక్కనుంచుకోండి.
చల్లారిన కందిపప్పులో తగినన్ని నీరు వేసి కాస్త బరకగా, అంటే గోధుమరవ్వ అంత బరకాగా గ్రైండ్ చేసుకోండి. (అవసరం మేరకు నీరు వేసుకోండి, కానీ పచ్చడి గట్టిగా ఉండాలి).
బరకగా రుబ్బుకున్న పచ్చడిలో క్యాబేజీ వేసి రెండు మూడు సార్లు పల్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు.
తాలింపుకోసం నూనె వేడి చేసి, తాలింపు సామాగ్రీ ఒక్కోటిగా వేస్తూ ఎర్రగా వేపి పచ్చడిలో కలిపేసుకోండి.