క్యాబేజీని ఒక కప్పు తురుముకోండి. క్యాబేజీ తురుముతో ఉప్పు వేసి గట్టిగా నీరు పిండి, ఆ నీటిని పక్కనుంచుకొండి.
క్యాబేజీ పిప్పిలో ముందు మసాలాలు కారాలు వేసి బాగా కలుపుకోండి.
మసాలాలు బాగా కలిపినా తరువాత, గోధుమపిండి, క్యాబేజీని, పిండిన నీరు వేసి ముందు కలుపుకోండి, ఆ తరువాత తగినన్ని నీరు చిలకరించుకుని పిండిని నాలుగైదు నిమిషాలు బాగా వోత్తుకోవాలి.
వోత్తుకున్న పిండి ఆరిపోకుండా, నూనె పూసి అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి.
ముప్పై నిమిషాలు పిండి నానిన తరువాత సమానంగా ఉండలు చేసుకుని పొడి పిండి చల్లి వోత్తుకోవాలి.
మీకు నచ్చితే ప్రతీ మడతలో, 4-5 బొట్లు నూనె వేసి వత్తుకోవచ్చు లేదా రోటీ మాదిరి మడత వేయకుండా వత్తుకోవచ్చు.
వత్తుకున్న పరాటాని వేడి వేడి పెనం మీద హై ఫ్లేమ్ మీద రెండు వైపులా కాలనిచ్చి తరువాత నూనె వేసి కాల్చుకుని తీసుకోండి.
ఈ పరాటాలు వేడి మీద చల్లగా ఎలా అయినా చాలా రుచిగా ఉంటాయి.