చెట్టినాడు చేపల పులుసు | చిక్కని స్పైసీ గ్రేవీతో ఉండే చెట్టినాడు చేపల పులుసు

| nonvegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • చేపలు ఊరబెట్టడానికి
  • 1 tbsp కారం
  • 1/2 tsp మిరియాల పొడి
  • నీళ్ళు కొద్దిగా
  • ఉప్పు
  • 1/2 kilo చేప ముక్కలు
  • గ్రేవీ కోసం
  • 4 tbsp నూనె
  • 1/2 tsp మిరియాలు
  • 1/2 tsp సొంపు
  • 1/2 tsp జీలకర్ర
  • 10 వెల్లులి
  • 5 ఎండుమిర్చి
  • 2 ఉల్లిపాయ (సన్నని తరుగు)
  • 1/4 tsp పసుపు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/4 cup పచ్చి కొబ్బరి
  • 2 tbsp ధనియాల పొడి
  • 2.5 tbsp కారం
  • 3 టొమాటో (సన్నని తరుగు)
  • చింతపండు – నిమ్మకాయ సైజు అంత
  • పులుసు కోసం
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/4 tsp మెంతులు
  • 6 వెల్లులి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 10 చిన్న ఉల్లిపాయలు
  • రాళ్ళ ఉప్పు
  • 300 ml నీళ్ళు
  • కొత్తిమీర – చిన్న కట్ట

విధానం

  1. ప్లేట్లో కారం ఉప్పు మిరియాల పొడి కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్లా చేసి చేప ముక్కలకి రుద్ది పట్టించి వదిలేయండి
  2. ముకుడులో నూనె వేడి చేసి అందులో మిరియాలు, జీలకర్ర, సొంపు, ఎండు మిర్చి వెల్లులి వేసి వేపుకోవాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా మూత వేపుకోవాలి.
  3. మెత్తబడ్డ ఉల్లిపాయాలో పచ్చి కొబ్బరి ముక్కలు ధనియాల పొడి, కారం, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి టొమాటోలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద మగ్గపెట్టండి.
  4. టొమాటోలు మగ్గి నూనె పైకి తేలేకా మిక్సీ జార్లోకి తీసుకుని చింతపండు నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  5. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి ఆవాలు చిటపటమనిపించాలి. ఆ తరువాత సొంపు, జీలకర్ర కరివేపాకు, వెల్లులి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  6. చింతపండు నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్, రాళ్ళ ఉప్పు, వేసి రంగు మారి నూనె పైకి తేలేదాక సన్నని సెగ మీద ఉడికిస్తే చిక్కని రుచికరమైన గ్రేవీ వస్తుంది.
  7. నూనె పైకి తేలాక 300 ml నీళ్ళు పోసి గ్రేవీని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ పైన నూనె తేలుతుంది. అప్పుడు చేప ముక్కలు, ఉంటే చేప గుడ్లు నెమ్మది వేసి మూత పెట్టి సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
  8. నూనె పైకి తేలాక పైన కొత్తిమీర తరుగు, కాడలతో సహా కరివేపాకు కాడలు వేసి స్టవ్ ఆపేసి గంట సేపు వదిలేయాలి. ఆ తరువాత వేడి అన్నం, చపాతీ, దోశా ఇడ్లీతో సర్వ చేసుకోండి.