అదే నెయ్యి లో మసాలా దీనుసులు వేసి 30 సెకన్లు వేపి, ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి
ఉల్లిపాయలు ఎర్రబడ్డాక అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపి, చికెన్ వేసి 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి.
తరువాత మిగిలిన మసాలాలూ, పుదీనా కొత్తిమీర చిలికిన పెరుగు వేసి మరో 2 నిమిషాలు వేపుకోవాలి. తారువాత నీళ్ళు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 కూతలు వచ్చే దాకా ఉడికించుకోవాలి
వేపుకున్న జీడిపప్పు లోంచి కొంత, బాదం, పిస్తా పప్పులు మొత్తం, పెరుగు వేసి మెత్తని పేస్ట్ చేసి ఉంచుకోండి
అడుగుమందంగా ఉన్న గిన్నెలో నెయ్యి పోసి అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పులు కాసిని నీళ్ళు పోసి బాగా కలిపి తరువాత పొయ్యి మీద పెట్టి చిక్కని జావాలా అయ్యేదాకా గడ్డలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి కనీసం 15 నిమిషాలు పడుతుంది
జావా చిక్కగా అయ్యాకా ఎనుపుకున్న చికెన్ వేసి పప్పు గుత్తి తో కలుపుతూ ఎనుపుతూ ఉండాలి.
15 నిమిషాలు ఎనిపిన తరువాత డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి మరో 15 నిమిషాలు ఏనుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద
30 నిమిషాల తరువాత గరం మసాలా, ¼ కప్పు నెయ్యి, మరో 15 నిమిషాలు ఏనుపుకోవాలి
45 నిమిషాల తరువాత వేపుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, మరో 15 నిమిషాలు ఏనుపుకోండి
గంట తరువాత ఎండిన గులాబీ రేకులు లేదా 1 తబసప రోజ్ వాటర్ ¼ కప్పు పాలు పోసి మరో 5 నిమిషాలు ఏనుపుకుని పైన 2 tbsp నెయ్యి వేసి కలిపి దింపేసుకోవాలి
సర్వ్ చేసే ప్లేట్లో హలీమ్ వేసి పైన కొద్దిగా నెయ్యి, వేపుకున్న జీడిపప్పు, వేపుకున్న ఉల్లిపాయ తరుగు, నిమ్మకాయ, ఉడికించిన గుడ్డు పెట్టి సర్వ్ చేసుకోండి