నూనె వేడి చేసి అందులో సెనగపప్పు, మినప్పప్పు వేసి ఎర్రగా మాంచి సువాసనోచ్చే దాక వేపుకోండి.
తరువాత ధనియాలు, ఎండుమిర్చి వేసి వేపి, పూర్తిగా ఆరిపోయిన కరివేపాకు వేసి 3-4 నిమిషాల పాటు వేపుకుని, దింపే ముందు వెల్లూలి, జీలకర్ర, చింతపండు వేసి మరో నిమిషం వేపి దింపి చల్లార్చుకోండి.
మిక్సీ జార్ లో ఉప్పు పసుపు, చల్లార్చుకున్న కరివేపాకు పోపు సామాను వేసి మెత్తని పొడిగా చేసుకోండి.
పొడిని గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే కనీసం నెల పైనే తాజా ఉంటుంది.