పప్పుని బియ్యం ని గంట సేపు నానబెట్టి కుక్కర్లో వేసి అందులో నెయ్యి పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కనుంచుకోండి.
కిచిడి కోసం నూనె నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర అల్లం అపచ్చిమిర్చి వెల్లులి ఇంగువ వేసి వేపుకోండి.
జీలకర్ర చిట్లి వెల్లులి మగ్గిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి.
ఉల్లి రంగు మారిన తరువాత టమాటో ముక్కలు వేసి టమాటో మెత్తబడే దాకా వేపుకోండి. టమాటో మెత్తబడ్డాక కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి మసాలాలు మాడకుండా వేపుకోండి.
వేగిన మసాలాల్లో మెత్తగా ఉడికించుకున్న అన్నం కొద్దిగా నీరు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఎనుపుకోండి.
అన్నం కాస్త గుజ్జుగా అయ్యాక మిగిలిన వేడి నీరు కూడా పోసి 4-5 నిమిషాలు అడుగుపెట్టకుండా కలుపుతూ ఉడికించుకోండి.
దింపే ముందు ఉప్పు కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.
నెయ్యి వేడి ఆఖరి తాలింపు సామాగ్రీ అంతా వేసి గుభాళించేలా తాలింపు వేపి స్టవ్ ఆపేసి కారం వేసి కలిపి కిచిడి పైన వేసి వేడివేడిగా వడ్డించండి.