డ్రై ఫ్రూట్స్ అన్ని విడివిడిగా వేడి నీరు పోసి కనీసం గంట సేపు నానబెట్టుకోండి.
గంట తరువాత ముందు జీడిపప్పు బాదాం వేసి బరకగా పలకులుగా గ్రైండ్ చేసుకోండి.
తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి రవ్వగా గ్రైండ్ చేసుకోండి.
చిక్కని పాలల్లో కుంకుమ పువ్వు, బరకగా రుబ్బుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి పాలు ముప్పావు అంటే 750ml అయ్యేవరకు కలుపుతూ మరిగిస్తూనే ఉండాలి. సరిగ్గా కలపకపోతే అడుగుపట్టేస్తుంది.
750ml అయ్యాక, పంచదార వేసి 2-3 నిమిషాలు మరిగించండి.
దింపే ముందు జాజికాయ పొడి, యాలకలు పొడి వేసి కలిపి చల్లార్చి ఫ్రిజ్లో 2-3 గంటలు ఉంచి చల్లగా సర్వ్ చేయండి