సొయా చంక్స్ని వేడి నీళ్లు పోసి నానబెట్టుకోండి . ఆలూ ని చెక్కు తీసి నాలుగు సగాలుగా కోసుకోండి
పెసరపప్పుని బియ్యాన్ని ఒక్కోటి విడివిడిగా వేపుకుని తీసుకుని నీళ్లు పోసి కడగండి.
కడిగిన పప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకోండి, ఇంకా ఆలూ ఉప్పు పసుపు కొద్దిగా నూనె ఆరు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ రానివ్వాలి
స్టీమ్ పోయాక మెత్తగా ఉడికిన కిచిడీలోంచి ఆలూ ముక్కలు పక్కకు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్లు పోసి అన్నని మెత్తగా మెదపండి
రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి రెండు గుడ్లు బాగా బీట్ చేసి నూనె లో పోసేయండి పైన చిటికెడు ఉప్పు వేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. (గుడ్డుని మరీ ఎర్రగా వేపకండి)
అదే మూకుడులో నూనే వేడి చేసి అందులో ఎండుమిర్చి బిర్యానీ ఆకులు సోంపు జీలకర్ర వేసి వేపుకోండి
వేగిన తాలింపులో అల్లం పచ్చిమిర్చి తరుగు వేసి వేపుకోండి.
తరువాత నీరు పిండేసి నానబెట్టుకున్న సోయా వేసి రెండు నిమిషాలు వేపుకోండి. వేగిన సోయాలో వేపుపుకున్న గుడ్డు వేసి 30 సెకన్లు టాస్ చేసి కిచిడిలో కలిపేసుకోండి.
ఆఖరుగా చిన్న పిడికెడు కొత్తిమీర కిచిడీలోంచి పక్కకు తీసుకున్న ఆలూ ముక్కలు వేసి కలుపుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.