చేపల పులుసు | ఆంధ్రా స్టైల్ చేపల పులసు చేపల మసాలా పొడితో
Curries
|
vegetarian
Prep Time10 Mins
Cook Time25 Mins
Servings5
కావాల్సిన పదార్ధాలు
చేప మసాలా పొడి కోసం
1
tbsp ధనియాలు
7
ఎండుమిర్చి
1/2
tsp మెంతులు
8 - 10
వెల్లులి
పులుసు కోసం
300
gm చేప ముక్కలు
1/2
cup నూనె
2
రెబ్బలు కరివేపాకు
2
ఉల్లిపాయ
4
పచ్చిమిర్చి
1
tbsp అల్లం వెల్లులి పేస్ట్
ఉప్పు
1/2
tsp పసుపు
1
tbsp కారం
1
tbsp ధనియాల పొడి
1/4
cup టొమాటో ముక్కలు
1/2
liter నీళ్ళు
200
ml చింతపండు నీళ్ళు (50 gm చింతపండు నుండి తీసినది)
కొత్తిమీరా – చిన్న కట్ట
విధానం
చేపల మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపి మెత్తని పొడి చేసుకోండి.
మిక్సీలో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
ముకుడులో నూనె వేసి అందులో కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఉప్పు వేసి వేపుకోండి. ఇంకా ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చాక అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి.
వేగిన ఉల్లిపాయాలో పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేపుకోవాలి.
ఆ తరువాత చింతపండు పులుసు, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద ఒక మరగనివ్వాలి.
మరుగుతున్న పులుసులో చేప ముక్కలన్నీ సర్ది సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక మరగనివ్వాలి.
15 నిమిషాలకి నూనె తేలుతుంది పులుసు చిక్కబడుతుంది అప్పుడు కొత్తిమీర తరుగు, చేపల మసాలా పొడి వేసి నెమ్మదిగా ముక్క చిదరకుండా కలిపి మరో 5 నిమిషాలు సన్నని సెగ మీద మరిగిస్తే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారు.