నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు రెబ్బలు కాడలతో సహా దంచిన వెల్లులి మిరియాల ముద్ద వేసి వెల్లులి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
వేగిన వెల్లులిలో టొమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి టొమాటోలని 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు.
చింతపండు పులుసు పోసి 2-3 పొంగులు రానివ్వాలి. పొంగిన పులుసులో నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి మెత్తబడే దాకా మరిగించాలి, తరువాత దింపేయాలి. (చారు సాంబార్కి మల్లె ఎక్కువగా మరగకూడదు).
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామగ్రి అంతా ఒక్కోటిగా వేసుకుంటూ పొట్టుతో ఉన్న వెల్లులి ని ఎర్రగా వేపి దింపే ముందు కొత్తిమీర వేసి కలిపి చారులో పొసెయ్యండి. అంతే ఘుమఘుమలాడే చారు తయారు.