కుక్కర్లో పులుసుకోసం ఉంచిన పదార్ధాలన్నీ నానబెట్టుకున్న సెనగప్పు, నీరు పోసి మూడు విజిల్స్ రానివ్వండి.
కుక్కర్ ఆవిరి పోయాక స్టవ్ ఆన్ చేసి ఉడికిన గోంగూరని పప్పుగుత్తితో ఎనుపుకోండి. తరువాత బియ్యం పిండి కలిపిన నీరు పోసి పులుసుని కాస్త చిక్కబడనివ్వాలి. చిక్కబడ్డాక స్టవ్ ఆపేయండి.
తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మీడియం ఫ్లేమ్ కచ్చితంగా తాలింపుని ఎర్రగా ఘుభాళించేలా వేపి పులుసులో కలిపేయండి.
ఈ పులుసు అన్నం జొన్న రొట్టెలు దేనితోనైనా చాలా రుచిగా ఉంటుంది.