కావాల్సిన పదార్ధాలు
-
గుమ్మడికాయ పులుసుకి:
-
300
gms తియ్యటి, ఎర్రటి గుమ్మడి ముక్కలు
-
3
tbsp నూనె
-
1
tsp ఆవాలు
-
1
tsp మినపప్పు
-
1/4
tsp మెంతులు
-
2
ఎండుమిర్చి
-
1
tsp జీలకర్ర
-
2
pinches ఇంగువ
-
2
sprigs కరివేపాకు
-
1 ¼
cups మందపాటి ఉల్లిపాయ చీలికలు
-
2
పచ్చి మిర్చి (చీలికలు)
-
ఉప్పు - రుచికి సరిపడ
-
1
tbsp ధనియాల పొడి
-
1/2
tbsp కారం
-
1/8
tsp పసుపు
-
800
ml నీరు
-
250
ml చింతపండు పులుసు
(( 30 gms చింతపండు నుండి తీసినది))
-
60
gms బెల్లం
-
కొత్తిమీర - చిన్న కట్ట
-
ముద్ద పప్పు:
-
1/2
cup కంది పప్పు
-
1
tsp నూనె - వేపడానికి
-
1 ¼
cup నీరు
-
1/4
tsp పసుపు
-
3
tbsp నెయ్యి
-
1
tsp జీలకర్ర
-
2
pinches ఇంగువ
విధానం
-
•గుమ్మడికాయ పులుసు కోసం:
నూనె వేడి చేసి ఆవాలు మెంతులు మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి ఎర్రగా వేపుకోవాలి
-
వేగిన తాలింపులో, ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి, అవాలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేపుకోవాలి.
-
మెత్తబడిన ఉల్లిపాయలో తీపి గుమ్మడి ముక్కలు, ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం నీరు వేసి వేపుకోవాలి.
-
నీరు పోసి, గుమ్మడి ముక్కలు మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించాలి.
-
గుమ్మడి ముక్కలు మెత్తబడిన తరువాత, చింతపండు పులుసు, బెల్లం వేసి ఇంకో 15 నిమిషాలు మరిగించాలి.
-
15 నిమిషాలు మరిగించిన తరువాత, ఉప్పు కారాలు రుచి చూసి, కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోండి.
-
•ముద్ద పప్పు కోసం:
నూనె వేడి చేసి కందిపప్పు వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
-
పప్పు మంచి సువాసన వచ్చాక, నీరు, పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించాలి.
-
మెత్తగా ఉడికిన పప్పులో ఉప్పు వేసి బాగా ఎనుపుకొవాలి.
-
తాలింపు కోసం ఉంచిన నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, ఇంగువ వేసి జీలకర్రని చిట్లనిచ్చి, ఎనుపుకున్న పప్పులో కలిపేసుకోవాలి.
-
వేడి అన్నం ముద్ద పప్పు గుమ్మడికాయ పులుసు కలిపి తినడం మాటలకందని మధురానుభూతి!!!