హర్యాలీ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి చల్లని నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
బిర్యానీ వండే పాత్రలో నెయ్యి నూనె వేసి వేడి చేసి పొడి బిర్యానీ మసాలా అంతా వేసి వేపుకోవాలి.
వేగిన మసాలాలో ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడే దాకా వేపుకోవాలి. తరువాత మిగిలిన కూరగాయాలన్నీ వేసి 60% వేగనివ్వాలి
వేగినా కూరగాయాల్లో ఉప్పు మిగిలిన పొడి మసాలాలు (కారం గరం మసాలా ఇంకా..)వేసి వేపుకోవాలి, ఆ తరువాత స్టవ్ ఆపేయండి.
స్టవ్ ఆపేసిన తరువాత హర్యాలీ పేస్ట్, ఫ్రొజెన్ బటానీ, పెరుగు, నిమ్మరసం, tbsp నెయ్యి, నూనె వేసి బాగా కలుపుకోవాలి.
బిర్యానీ రైస్ వండుకోడానికి మరిగే నీళ్ళలో మసాలా దినుసులు ఉప్పు అన్నీ వేసి మరగ కాగనివ్వాలి 3-4 నిమిషాలు.
మరుగుతున్న ఎసరులో నానబెట్టిన బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద 80% ఉడికించుకోవాలి.
80% ఉడికిన అన్నాన్ని వడకట్టి బిర్యానీ కోసం మసాలాలు కలిపి ఉంచిన కూరగాయల మీద వేసుకోవాలి.
అన్నం అంతా వేశాక పైన కొద్దిగా గరం మసాలా నెయ్యి బిర్యానీ రైస్ ఉడికించుకున్న నీళ్ళు ½ కప్పు అన్నం అంతా పోసుకోవాలి ఒకే దగ్గర కాకుండా. ఇంకా కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా.
బిర్యానీ గిన్నె అంచులకి మైదా పిండి ముద్ద పెట్టి ఒక దగ్గర కొంచెం ఖాళీ వదిలి ధం బయటకి పోకుండా మూత బిగించి పెట్టాలి.
ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే స్టీమ్ ఖాళీ వదిలిన చోట నుండి వేగంగా తన్నుకు వస్తుంది. అప్పుడు మంట తగ్గించి లో-ఫ్లేమ్లోకి తగ్గించి మీద 8 నిమిషాలు ఉడికించి, తరువాత స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయండి.
20 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తరువాత మూత తీసి ఘుమఘుమలాడే బిర్యానీ చల్లని రైతాతో ఎంజాయ్ చేయండి.