మసాలా మిక్స్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి గుడ్లు చిదరకుండా మసాలాలని బాగా నలుపుతూ గుడ్లకి పట్టించాలి
ఎసరు నీళ్ళలో పొడి ఉప్పు, మసాలా దినుసులన్నీ వేసి 2-3 నిమిషాలు మరగనిస్తే ఫ్లేవర్స్ నీళ్ళలో దిగుతాయి
తరువాత బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి చీలికలు, నిమ్మరసం, పుదీనా కొత్తిమీర, వేసి 90% ఉడికించుకోవాలి (90% ఉడికించడం అంటే ఎంతో టిప్స్ చూడగలరు)
90% ఉడికిన అన్నాన్ని మసాలా దినుసులతో పాటు వడకట్టి మసాలా మీద వేసెయ్యండి.
బిర్యానీ రైస్ మీద నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు, గరం మసాలా పుదీనా తరుగు వేసి ధం బయటకి పోకుండా గట్టిగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 8 నిమిషాలు ధం చేసి 15 నిమిషాలు వదిలేయండి. (ఎండిన గులాబీ రేకులు లేని వారు ఇప్పుడు రోస్ వాటర్ రైస్ పైన వేసుకోవచ్చు)
15 నిమిషాలా తరువాత స్పైసీ మిర్చి కా సాలన్ లేదా మీకు నచ్చిన కర్రీ రైతాతో సర్వ్ చేసుకోండి.