సగ్గుబియ్యంలో నీళ్ళు పోసి కనీసం రెండు గంటలు నానబెట్టుకోండి. బియ్యం కూడా మరో గిన్నెలో వేసి నీళ్ళు పోసి 2 గంటలు నానబెట్టుకోండి
నానిన సగ్గుబియ్యంని పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అలాగే బియ్యం కూడా మెత్తగా రుబ్బుకోండి. స్టోన్ గ్రైండర్ వాడితే రెండూ కలిపి రుబ్బుకోవచ్చు. మిక్సీలో అయితే ఒక్కోటిగా రుబ్బుకోవడం మేలు
మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
గిన్నెలో సగ్గుబియ్యం పిండి, బియ్యం పిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు తగినన్ని నీళ్ళు చేర్చి అట్ల పిండి జారుగా కలుపుకోండి
పెనం మీద అట్ల మాదిరి పలుచగా పోసి నూనె వేసి రెండు వైపులా కాలుచుకుని తీసుకోండి. ఇవి గుంటూర్ అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయ్.