పెరుగులో, వంట సోడా కలిపి 30 సెకన్లు వదిలెయ్యండి . పెరుగు పొంగుతుంది.
అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోండి.
పొంగిన పెరుగులో, రవ్వ, సేమియా, ఉప్పు, నీరు, దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాలు వదిలేయ్యండి. పిండి పొంగుతుంది సేమియా మెత్తబడుతుంది.
నూనె వేడి చేసి, ఉల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి ఒక నిమిషం వేపి, పులిసిన పిండిలో కలిపేయ్యండి.
పెనంని వేడి చేసి, పెద్ద గరిటెడు పిండిని పెనం మీద పోసి నెమ్మదిగా తడితే, కాస్త స్ప్రెడ్ అవుతుంది పిండి.
పిండి అంచుల వెంట నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చండి. తరువాత ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కాల్చి వేడి వేడిగా నచ్చిన పచ్చడి సాంబారుతో సర్వ్ చేసుకోండి.