పల్చని అటుకులలో పుల్లని మజ్జిగ పోసి 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత మెత్తగా మెదుపుకోవాలి లేదా మిక్సీ వేసుకోండి .
మెత్తగా గుజ్జులా మెదుపుకున్న అటుకులలో బియ్యం రవ్వ, సోడా, ఉప్పు తగినంత పుల్లని మజ్జిగ పోసి ఇడ్లీ పిండి అంత గట్టిగా కలుపుకుని పక్కనుంచుకోండి .
30 నిమిషాల తరువాత మజ్జిగలో నానిన రవ్వని పుల్లని మజ్జిగతో ఇడ్లీ పిండి మాదిరి పలుచన చేసుకోండి .
ఇడ్లీ ప్లేట్స్ లో కాస్త నెయ్యి రాసి పిండి వేసి 5 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద 2 నిమిషాలు లో- ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసి 3 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి . ఆ తరువాత ఇడ్లీ తీసుకోండి.
ఈ ఇడ్లీ పల్లీల చట్నీ, సాంబార్, అల్లం పచ్చడి దేనితో అయినా చాలా రుచిగా ఉంటుంది.