మినపప్పుని కడిగి ఒక గంట నానబెట్టుకోండి. నానిన పప్పుని కుక్కర్లో ఒకటికి రెండు నీరు పోసి మెత్తగా ఉడికించుకోండి.
ఉడికిన పప్పుని వడకట్టి పప్పు ఉడికించుకున్న నీటితో మెత్తగా క్రీమ్ మాదిరి గ్రైండ్ చేసుకోండి.
బియ్యం పిండిలో మిగిలిన పదార్ధాలు వెన్నల రుబ్బుకున్న మినపప్పు పేస్ట్ ఇంకా మినపప్పుని ఉడికించుకున్న నీరు వేసి ముందు బాగా కలుపుకోండి.
అవసరానికి తగినట్లు నీరు చేర్చుకుంటూ పిండిని మృదువుగా తడుపుకోండి.
జంతికల గొట్టం లో పిండి ముద్ద ఉంచి ఒక చిల్లుల గరిట మీద మూడు లేదా నాలుగు చుట్లు చుట్టి అంచులని అంటించండి.
అంచులని అంటించిన జంతికని మరిగే వేడి నూనెలో వేసి 5-6 వేసి మీడియం మీద గోధుమ రంగులోకి వచ్చేదాకా లేదా వేసిన జంతికల చుట్టూ బుడగలు తగ్గేదాకా వేపుకుని తీసుకోండి.
తీసుకున్న జంతికలని జల్లెడలో పూర్తిగా చల్లార్చి డబ్బాలో పెట్టుకుంటే కనీసం పది రోజులు నిలవుంటాయి.