నాలుగు గంటలు నానబెట్టిన మినపప్పు బియ్యం మెంతులని మెత్తగా రుబ్బుకుని కనీసం 12 గంటలు పులియబెట్టాలి. (టిప్స్ చూడండి).
పులసిన పిండిలో కొద్దిగా ఉప్పు అవసరానికి తగినట్లు నీళ్ళు కలిపి పక్కనుంచుకోండి.
ఎర్ర కారం కోసం మిరపకాయలలో వేడి నీళ్ళు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోండి.
నానిన మిరపకాయలు ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి (మరో పద్ధతి కోసం టిప్స్ చూడండి).
పప్పుల పొడి కోసం వెల్లులి పుట్నాలు వేసి మెత్తని పొడి చేసుకోండి.
బొంబాయ్ చట్నీ కోసం నానబెట్టిన చింతపండు నుండి రసాన్ని తీయండి, అందులో శెనగపిండి, నీళ్ళు, ఉప్పు వేసి చేత్తో గడ్డలు లేకుండా బాగా కలిపి పక్కనుంచుకోండి.
పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి తరువాత ఎండుమిర్చి ముక్కలు జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, పసుపు వేసి వేపుకోండి.
వేగిన తాలింపు మంట తగ్గించి శెనగపిండి నీళ్ళు పోసి గడ్డలు లేకుండా బాగా కలిపి ఒక పొంగు రానివ్వాలి.
ఒక పొంగు రాగానే ఉప్పు రుచి చూసి దింపేసుకోండి (పర్ఫెక్ట్ బొంబాయ్ చట్నీ కోసం టిప్స్ చూడండి).
పెనాన్ని బాగా వేడి చేసి పెద్ద గరిటేడు పిండి పోసి కొద్ది మందంగా పిండి స్ప్రెడ్ చేసుకోండి.
పిండి అంచుల వెంట 1.5 tbsp నూనె వేసి కాల్చుకోవాలి. అట్టు మధ్యన ఎర్రబడుతుండగా నెయ్యి వేసి అట్టు అంతా పూసి మంట తగ్గించి నిదానంగా ఎర్రగా కాల్చుకోవాలి (అట్టు ఎర్రగా కాల్చడానికి టిప్స్ చూడండి).
అట్టు ఎర్రగా కాలాక అట్టుని తిరగతిప్పి 30 సెకన్లు కాల్చి మళ్ళీ తిరగతిప్పి ఎర్ర కారం 1 tbsp వేసి అట్టు అంతా పూయాలి ఆ పైన పప్పుల పొడి చల్లి అట్టుని మధ్యకి మడిచి బొంబాయ్ చట్నీ, కొబ్బరి పచ్చడితో వేడి వేడిగా ఆనందించండి.