చికెన్ లో,ఉప్పు పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి కనీసం ముప్పై నిమిషాలైనా ఊరనివ్వాలి.
మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి. ఆఖరున కొబ్బరి పొడి, గసాలు వేసి వేపుకోవాలి.
వేగిన మసాలా దినుసులని చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి.
చికెన్ లో నీరు పోసి కుక్కర్ మూతపెట్టి, హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి స్టీమ్ ను పోనివ్వండి.
నూనె వేడి చేసి, జీడిపప్పుని ఎర్రగా వేపి పక్కనుంచుకోండి.
మిగిలిన నూనెలో, కరివేపాకు అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపి ఉడికిన చికెన్ని నీరుతో సహా పోసి మీడియం ఫ్లేమ్ మీద లేత బంగారు రంగు వచ్చేదాకా అడుగుపట్టి మాడకుండా కలుపుకోవాలి.
సుమారుగా 20 నిమిషాలకి చికెన్ ముక్క రంగు మారుతుంది. అప్పుడు ఉప్పు కారం, వేపుకున్న మసాలా పొడి, వేపుకున్న జీడిపప్పు వేసి కలిపి ఇంకో రెండు నిమిషాలు వేపి దింపేసుకోండి.