కావాల్సిన పదార్ధాలు
-
300
gms కంద
-
5
ఉడికించిన కోడిగుడ్లు
-
మసాలా పేస్ట్ కోసం:
-
3
tbsp నూనె
-
1.5
inch దాల్చిన చెక్క
-
3
లవంగాలు
-
2
యాలకలు
-
¼
cup ఎండు కొబ్బరి
-
అల్లం - చిన్న ముక్క
-
7 - 8
వెల్లులి
-
1
tbsp ధనియాలు
-
1
tbsp నువ్వులు
-
½
tbsp గసగసాలు
-
పులుసు కోసం:
-
3
tbsp నూనె
-
1
cup ఉల్లిపాయ తరుగు
-
10 - 12
సాంబార్ ఉల్లిపాయలు
-
పచ్చిమిర్చి - 2 చీలికలు
-
2
sprigs కరివేపాకు రెబ్బలు
-
ఉప్పు - రుచికి సరిపడా
-
¼
tsp పసుపు
-
½
tbsp కారం
-
3
tbsp చింతపండు పులుసు
-
1
tbsp బెల్లం
-
కొత్తిమీర - కొద్దిగా
-
¼
tsp గరం మసాలా
-
2
cups నీరు
విధానం
-
చేతులకి నూనె రాసుకుని కందని కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని పసుపు ఉప్పు వేసిన నీళ్లలో వేసి కడిగి పక్కనుంచుకోండి.
-
కుక్కర్లో కంద ముక్కలు, పసుపు, ముక్కలు మునిగేదాకా నీరు పోసి మూడు కూతలు హై ఫ్లేమ్ మీద రానివ్వండి.
-
నూనె వేడి చేసి ఉడికించుకున్న గుడ్లకి గాట్లు పెట్టి కొద్దిగా పసుపు వేసి వేపి పక్కనుంచుకోండి.
-
మిగిలిన నూనెలో మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద వేపి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేపుకోవాలి.
-
ఉల్లిపాయ మెత్తబడిన తరువాత కంద ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి ముక్కలు చిదిరిపోకుండా 2 నిమిషాలు వేపుకోండి.
-
తరువాత మసాలా పేస్ట్ నీరు, చింతపండు పులుసు పులుసు పోసి రెండు పొంగులు రానివ్వండి.
-
పులుసు ఉడుకు పట్టిన తరువాత, ఉడికించుకున్న గుడ్లు, బెల్లం వేసి, నూనె పైకి తేలనివ్వండి.
-
దింపబోయే ముందు గరం మసాలా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.