బియ్యం పెసరపప్పు తెల్లగా మారే దాకా కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి కనీసం గంటసేపు నానబెట్టుకోవాలి
గంట తరువాత కుక్కర్లో నానిన బియ్యం, పప్పు నీరు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద 4 కూతలు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
పొంగల్ ఉడికాక రెండు చెంచాల నెయ్యి రెండు రెబ్బలు కరివేపాకు వేసి బాగా కలిపి పక్కనుంచుకోండి .
నెయ్యి వేడి చేసి ముందుగా మిరియాలు వేసి చిట్లనివ్వాలి. మిరియాలు చిట్లిన తరువాత అల్లం తురుము వేసి వేపుకోండి
వేగిన అల్లం తురుముతో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. చిట్లిన జీలకర్రలో జీడిపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. వేగిన పప్పులో కరివేపాకు ఇంగువ వేసి ఎర్రగా వేపుకోండి.
వేగిన తాలింపుని పొంగల్లో వేసి కలుపుకోండి. ఆఖరుగా పైన రెండు చెంచాల నెయ్యి వేసి కలపకుండా మూతపెట్టి వదిలేస్తే తాలింపు పరిమళం అంతా పొంగల్ పట్టుకుంటుంది.
పది నిమిషాల తరువాత వేడి వేడి మద్రాస్ వెన్ పొంగల్ కరకరలాడే వడ సాంబార్ కొబ్బరి పచ్చడితో ఆశ్వాదించండి.