మామిడి పండు మజ్జిగ చారు | మాంబలం పులిస్సేరీ

Curries | vegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 2 పండు మామిడిపండ్లు
  • 1/2 cup పచ్చికొబ్బరి
  • 1/2 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • ఉప్పు
  • 300 ml నీళ్ళు
  • 1/2 tsp కారం
  • 1.5 tbsp పచ్చిమిర్చి పేస్ట్
  • పసుపు – చిటికెడు
  • తాలింపు
  • 2 tsp కొబ్బరి నూనె / శెనగ నూనె
  • 2 చిటికెళ్ళు మెంతులు
  • 1 tsp ఆవాలు
  • 2 ఎండు మిర్చి
  • 1 రెబ్బ కరివేపాకు
  • ఇంగువ – చిటికెడు

విధానం

  1. మిక్సీ లో కొబ్బరి మిరియాలు జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
  2. మామామిడిపండుని మెత్తగా నలిపి గుజ్జు తీసుకోండి
  3. పులుసు కాచే గిన్నెలో కొబ్బరి పేస్ట్, మామిడిపండు గుజ్జు ఇంకా మిగిలిన పదార్ధాలన్నీ వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి
  4. పొంగువచ్చాక చిలికిన పెరుగు వేసి మంట తగ్గించి పులిస్సేరీలో కలిసేదాకా కలుపుతూనే ఉండాలి. పెరుగు కలిశాక ఒక్క పొంగురానివ్వాలి
  5. తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి వేపి పులిస్సేరీలో కలుపుకోవడమే
  6. ఇది అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.