చెంచా నూనె వేసి అందులో 4 ఉడికించిన గుడ్లకి గాట్లు పెట్టి వేసుకోండి అందులోనే కొంచెం పసుపు వేసి టాస్ చేసుకుంటూ వేపి తీసుకోండి
అదే పాన్లో మిగిలిన నూనే వేడి చేసి అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. చిట్లిన జీలకర్రలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడి దాకా వేపుకోవాలి
వేగిన ఉల్లిలో అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి . ఆ తరువాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా నీళ్లు వేసి వేపుకుంటే మసాలాలు మాడవు.
4. మసాలాల్లోంచి నూనె పైకి తేలిన తరువాత మెంతి కూర ఆకు తరుగు వేసి కచ్చితంగా నూనె పైకి తేలేదాక వేపుకోవాలి అప్పుడే ఆకులో పసరు వాసన పోయి చేదు తగ్గుతుంది
ఆకు బాగా వేగిన తరువాత టమాటో గుజ్జు వేసి నూనె పైకి తేలేదాకా మూతపెట్టి వేపుకోండి
నూనె పైకి తేలిన తరువాత వేపిన గుడ్లు నీళ్లు కసూరి మేథీ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7-8 నిమిషాలు వదిలేస్తే గుద్దుకీ మసాలా పరిమళం అంతా పట్టి నూనె పైకి తేలుతుంది, అప్పుడు దింపేసుకోండి.