చింతపండులో నీరు పోసి 30 నిమిషాలు నానబెట్టి పిప్పి తీసి పులుసు తీసి ఉంచుకోండి
బియ్యం కడిగి అందులో నీరు ఉప్పు పసుపు నూనె వేసి కుక్కర్మూత పెట్టి మూడు విజిల్స్రానివ్వండి
మూడు విజిల్స్రాగానే కుక్కర్మూత తీసి నూనె రాసిన పళ్లెంలో అన్నం వేసి గాలికి పూర్తిగా ఆరనివ్వాలి( అన్నం పొడి పొడిగా వండు కోవడానికి పైన టిప్స్ఉ న్నాయ్చుడండి)
పులిహోర పొడి కోసం ఉంచి నపదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి మీడియం ఫ్లేమ్మీద మాంచి సువాసానొచ్చేదాక వేపుకోవాలి. ఆఖరుగా నువ్వులు వేసి చిట్లనిచ్చి దింపి మెత్తని పొడి చేసుకోండి
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు సెనగపప్పు మినపప్పు వేరుశెనగగుండ్లు వేసిసెనగగుండ్లు చిట్లిమిగిలిన పప్పులు మాంచి రంగులో వచ్చేదాకా వేగనివ్వాలి.
తాలింపు ఎర్ర బడ్డాక మాత్రమే కరివేపాకు ఇంగువ వేసివేపుకోండి.
వేగి ఆన్తాలింపులో చింతపండు పులుసు బెల్లం ముక్క వేసి రెండు పొంగులు రానిచ్చి పులిహోర మిరియాల పొడి వేసి కలుపుతూ చిక్కబరచాలి
నేను ఇరవై నిమిషాలు మరిగించాను మాధ్య మధ్య నకలుపుతూ. ఇరవై నిమిషాలకి పులుసు చిక్కబడి నూనె పైకి తేలింది
చిక్కబడిన పులుసు స్టవ్ఆ పేసి వండుకున్న అన్నం వేసి కలిపి నెమ్మదిగా పట్టించి కనీసం 30 నిమిషాలైనా ఊరనివ్వండి.