పప్పుని బాగా కడిగి కనీసం ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి.
పప్పు ఉడికించుకోడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా ఉడికించి ఎనుపుకోండి.
సాంబార్ ముద్ద కోసం నూనే వేడి చేసి అందులో మిగిలిన దినుసులు ఒక్కటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి.
ఆఖరుగా గసాలు కొబ్బరి వేసి వేపి నీళ్లతో మెత్తని ముద్ద చేసుకోండి.
నూనె వేడి చేసి అందులో ఉల్లి మునక్కాడ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి 10-12 నిమిషాలు వేపి తరువాత నీరు పోసి 80% ఉడికించుకోండి.
80% ఉడికిన మునక్కాడలో టమాటో ముక్కలు వేసి మగ్గనిచ్చి చింతపండు పులుసు ఉప్పు పోసి మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.
తరువాత సాంబార్ ముద్ద, ఎనుపుకున్న పప్పు, కారం, పసుపు, కొత్తిమీర, బెల్లం, నీరు పోసి కలిపి 10-12 నిమిషాలు మరగనివ్వాలి. మరుగుతున్న సాంబార్ ని మధ్యమధ్యలో కలుపుతుండాలి.
ఆఖరుగా తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామగ్రీ అంతా వేసి తాలింపుని ఎర్రగా వేపి సాంబారులో పోసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మరో ఐదు నిమిషాలు మరగనిచ్చి దింపేసుకోండి.