మిక్సీ లో పేస్టు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్ళతో పలుకులేని మెత్తని పేస్టు చేసుకోవాలి.
మూకుడులో నూనె వేడి చేసి బెండకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హై-ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. బెండకాయలు వేగాక తీసి పక్కనుంచుకోండి.
అదే మూకుడులో ఇంకాస్త నూనె వేడి చేసి అందులో ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి.
అందులోనే అల్లం, పసుపు వేసి కరివేపాకు వేసి వేపుకుని ఇంగువ కూడా వేసి వేపుకోవాలి.
అల్లం వేగాక మెత్తగా రుబ్బుకున్న సెనగపప్పు కొబ్బరి పేస్టు వేసి కొంత పక్కనుంచుకోవాలి.
సెనగపప్పు ముద్ద వేపి కాసిని నీళ్ళు పోసి ఉడుకుపట్టేదాక మీడియం ఫ్లేం మీద ఉడకనివ్వాలి.
చిలికిన పెరుగులో సెనగపప్పుముద్ద వేసి బాగా కలిపి మూకుడులో పోసి ½ లీటర్ నీళ్ళు ఉప్పు వేసి గడ్డలు లేకుండా కలుపుకుని సన్నని సెగ మీద ఓ ఉడుకు రానివ్వాలి.