చిట్లిన జీలకర్రలో అల్లం పచ్చిమిర్చి తరుగు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి.
వేగిన మిర్చిలో ఉల్లిపాయ సన్నని తరుగు స్వీట్ కార్న్ ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడి దాకా వేపుకోవాలి.
వేగిన ఉల్లిపాయలో పాల కూర సన్నని తరుగు వేసి ఆకు మెత్తబడి పసరు వాసన పోయేదాకా వేపుకోవాలి.
తరువాత సాంబార్ పొడి వేసి 30 సెకన్లు వేపుకోవాలి. తరువాత పొడి పొడిగా వండుకున్న అన్నం మిరియాల పొడి వేసి మెతుకు వేడెక్కేదాకా హై ఫ్లేమ్ మీద వేపి స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండి దింపేసుకోవాలి.