పాన్లో టమాటో ముక్కలు, ఉల్లిపాయ, చెక్క, లవంగాలు, యాలకలు, జీడిపప్పు ½ లీటర్ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
మెత్తగా ఉడికాక నీళ్ళతో సహా వెన్నలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
పాన్ లో బటర్ కరిగించి అందులో, కాస్త నూనె, కష్మీరి కారం వేసి కాసేపు వేపి అందులో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు టమాటో పేస్టు వేసి బాగా కలుపుతూ చిక్కబడనివ్వండి.
గ్రేవీ చిక్కబడ్డాక కసూరీ మేథీ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి 300 ml నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.
మరుగుతున్న గ్రేవీ పైన నూరగతో తేట ఏర్పడుతుంది దాన్ని తీసేయండి. కూర ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
గ్రేవీ కాస్త చిక్కబడ్డాక పనీర్ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి.