నానబెట్టుకున్న పెసల్లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి తగినన్ని నీరు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బుకున్న పిండిలో కరివేపాకు తరుగు, వంట సోడా వేసి కనీసం 5-6 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి, అప్పుడు పిండి తేలికపడి పునుకులు లోపల ఉండ ఏర్పడకుండా కరకరలాడుతూ వస్తాయి.
పిండిని బాగా బీట్ చేసుకున్నాకా చేతికు తడి చేసుకుని నిమ్మకాయంత పిండి ముద్దల్ని మరిగే వేడి నూనెలో వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి.
నూనె వేడి చేసి అందులో శెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆ తరువాత అల్లం ముక్కలు వేసి వేపుకోండి.
అల్లం కాస్త వేగాక పచ్చిమిర్చి, ఉప్పు వేసి కేవలం మిర్చీ పైన మచ్చలు ఏర్పడే వరకు వేపుకుంటే సరిపోతుంది.
వేగిన అల్లం మిర్చి అన్నీ మిక్సీలో వేసుకోండి ఇందులోనే చింతపండు బెల్లం కొద్దిగా నీరు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేపండి ఆ తరువాత రుబ్బుకున్న పచ్చడివేసి కలిపి స్టవ్ ఆపేయండి.
ఈ పచ్చడి మీకు ఫ్రిజ్లో కనీసం వారం పైనే నిలువ వుంటుంది.