పాన్లో నూనె వేడి చేసి అందులో సొంపు, జీలకర్ర, నలిపిన ధనియాలు, వాము వేసి వేపుకోవాలి.
వేగిన మసాలాలో ఉల్లిపాయ తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి.
అల్లం వెల్లులి పేస్ట్ వేగిన తరువాత మిగిలిన మసాలాలు అన్నీ వేసి వేపుకోవాలి.
నూనె పైకి తేలాక టొమాటో తరుగు కాసిని నీళ్ళు పోసి టొమాటో మెత్తగా గుజ్జుగా అయ్యి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
వేగిన మసాలాల్లో మెదిపిన ఆలూ వేసి పాన్ అడుగుపట్టేదాక వేపుకోవాలి. ఆ తరువాత నీళ్ళు పోసి హాయిగహ ఫ్లేమ్ మీద ఒక పొంగు రావాలి.
పొంగువచ్చిన తరువాత కొన్ని ఆలూని గరిటతో మెదుపుకోవాలి. ఆ తరువాత కసూరి మేథి నలిపి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి.
దింపే ముందు ఒక్క సారి ఉప్పు కారాలు సరిచూసి దింపేసుకోండి.