రొయ్యలు నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి మసాలా బాగా పట్టించి గంట సేపు నానబెట్టుకోవాలి.
అన్నం వండుకోడానికి నీళ్ళు మరిగించి మసాలా దినుసులు వేసి ఎసరుని బాగా మరిగించాలి.
మరిగే నీళ్ళలో నానబెట్టిన బాస్మతి బియ్యం గులాబీ రేకులు వేసి 80% ఉడికించుకోవాలి
80% ఉడికిన అన్నాన్ని గంటసేపు నానుతున్న రొయ్యల మీద వేసుకోవాలి.
80% ఉడికిన అన్నం మీద ధం చేయడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసుకోండి.
తరువాత మైదా పిండి ముద్ద ప్లేట్ అంచుకు పెట్టి ధం బయటకి పోకుండా సీల్ చేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ధం చేసి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
20 నిమిషాల తరువాత అడుగు నుండి నెమ్మదిగా బిర్యానీ తీసి మిర్చి కా సాలన్తో సర్వ్ చేసుకోండి.