ఉసిరికాయంత చింతపండు నుండి తీసిన 3 కప్పుల నీళ్ళు ()
1
tsp జీలకర్ర
విధానం
బియ్యం రవ్వని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాక కలుపుతూ రంగు మారకుండా వేపుకోవాలి.
ముకుడులో నూనె వేడి చేసి అందులో వేరు శెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. పప్పు వేగుతుండగా ఆవాలు,శెనగపప్పు, మినపప్పు ఎండు మిర్చి జీలకర్ర మిరియాల పొడి వేసి వేపుకోవాలి.
వేగిన తాలింపులో చింతపండు నీళ్ళు, ఉప్పు పసుపు కరివేపాకు రెబ్బలు వేసి హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి.
మరుగుతున్న ఎసరులో వేపుకున్న బియ్యం రవ్వ పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రవ్వ మెత్తబడే దాకా ఉడకనివ్వాలి.
రవ్వ మెత్తగా ఉడికాక స్టవ్ ఆపేసి 10 నిమిషాలు వదిలేస్తే ఉప్మా బిగుసుకుంటుంది. వేడిగా ఉప్మా ఆవాకాయ పచ్చడి, లేదా కారం పొడితో చాలా రుచిగా ఉంటుంది.