పల్లీలు ఎండుమిర్చి మిక్సీలో బరకగా పొడి చేసుకోవాలి.
గిన్నెలో ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి ముందు ఉల్లిపాయల్ని పిండుతూ బాగా కలుపుకోవాలి.
పిండిన ఉల్లిపాయల్లో రాగి పిండి గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి జీలకర్ర వేసి బాగా కలుపుకోండి. పిండి మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకుని తడిపొడిగా పిండి కలుపుకోండి.
కలుపుకున్న పిండిని వేడి నూనెలో కొద్దిగా కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద బుడగలు తగ్గేదాకా వేపుకుని తీసుకోండి. (ఒక్క సారి వేపే టిప్స్ చూడగలరు) తీసిన పకోడీ జల్లెడ వేసి ఉంచాలి.