రాయలసీమ పులగం పల్లీ పచ్చడితో

One Pot Recipe | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 20 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • పులగం కోసం
  • 1 cup బియ్యం
  • 1/2 cup పెసరపప్పు
  • 1 tsp ఆవాలు
  • 1/2 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 1 ఉల్లిపాయ చీలికలు
  • 2 రెబ్బల కరివేపాకు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 2 టమాటో ముక్కలు
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 3 cups నీళ్లు
  • పల్లీ పచ్చడి
  • 1 cup వేరుశెనగగుళ్ళు
  • 10 ఎండు మిర్చి
  • ఉప్పు
  • చింతపండు - ఉసిరికాయంత
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1 టమాటో ముక్కలు
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1/4 tsp పసుపు
  • 7 - 8 వెల్లులి
  • 3 tbsp నూనె

విధానం

  1. పులగం కోసం: కుక్కర్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆ తరువాత మిరియాలు వేసి వేపుకోవాలి.
  2. ఆవాలు వేగిన తరువాత ఉల్లిపాయ చీలికలు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి.
  3. ఉల్లిపాయలు మెత్తబడ్డాక అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోండి. వేగిన తరువాత టమాటో ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి.
  4. గంట సేపు నానబెట్టిన బియ్యం గంట సేపు కడిగి నానబెట్టిన పొట్టు పెసరపప్పు వేసి చెమ్మరిపోయేదాకా వేపుకోవాలి.
  5. చెమ్మారిన బియ్యంలో నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ హాయ్ ఫ్లేమ్ మీద 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి.
  6. 20 నిమిషాల తరువాత అడుగునుండి నెమ్మదిగా కలిపి పల్లీ పచ్చడి, పచ్చి పులుసుతో సర్వ్ చేసుకోండి.
  7. పల్లీ పచ్చడి కోసం: కప్పు పల్లీలని సన్నని సెగ మీద వేపి, చల్లార్చి పొత్తు తీసి ఉంచుకోవాలి.
  8. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
  9. వేగిన ఎండుమిర్చి పొట్టు తీసుకున్న పల్లీలు నానబెట్టుకున్న చింతపండు తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  10. నూనెలో ధనియాలు జీలకర్ర పసుపు ఉప్పు వేసి వేపుకోవాలి తరువాత టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేపి తీసి మీకేసీ జార్లో వేసి 3-4 సార్లు పల్స్ చేసి తీసుకొండి.
  11. మెదిగిన పచ్చడిలో ఆఖరుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేడివేడిగా కిచిడి, అట్టు ఇడ్లీ ఇలా దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.