రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి

Breakfast Recipes | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 15 Mins
  • Servings 25

కావాల్సిన పదార్ధాలు

  • 1/4 cup మినపప్పు
  • 1/4 cup పచ్చి సెనగపప్పు
  • 1/4 cup కంది పప్పు
  • చింతపండు - ఉసిరికాయంత
  • 20 - 30 ఎండు మిర్చి
  • 1 tbsp మిరియాలు
  • 1 tbsp జీలకర్ర
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లులి - నచ్చితే వేసుకోండి
  • ఇంగువ బెల్లం - నచ్చితే వేసుకోండి

విధానం

  1. మూడు పప్పుల్ని నెమ్మదిగా సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి, అలా వేపితేనే పప్పులు సమానంగా ఒకే తీరుగా వేగుతాయ్. వేగిన పప్పుల్ని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
  2. మిరపకాయలని సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. వేగిన మిర్చిని మరో ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
  3. మిరియాలు జీలకర్ర వేసి కలుపుతూ జీలకర్ర చిట్లేదాకా వేపుకోవాలి. వేగిన జీలకర్ర మిరియాలని పప్పులలో కలిపేసుకోవాలి.
  4. చింతపండుని కూడా ముప్పై సెకన్లు వేపుకుని తీసుకోవాలి.
  5. ముందు మిక్సీలో చల్లారిన మిర్చి ఉప్పు చింతపండు వేసి మిర్చీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు చల్లారిన పప్పుల్ని మిరియం జీలకర్రని కూడా వేసి మెత్తని పొడి చేసుకోండి.
  7. నచ్చితే వెల్లులి పొడి గ్రైండ్ అయిన తరువాత వేసి పల్స్ మీద గ్రైండ్ చేసుకుని తీసుకోండి.
  8. పొడిని గాలి చొరని డబ్బాలో పెట్టి ఉంచుకుంటే రెండు నెలల పైనే నిల్వ ఉంటుంది.