బాదం గసగసాలని నీరు పోసి 30 నిమిషాలు నానబెట్టి నీటిని వడకట్టి మెత్తని పేస్ట్ చేసుకోండి.
పచ్చిశెనగప్పలుని నీరు పోసి 1/2 గంట నానబెట్టుకోండి.
నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు పెట్టండి.
ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి ఉల్లిని మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వండి.
మగ్గిన ఉల్లిలో బీరకాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపి మూత పెట్టి 10-12 నిమిషాలు మగ్గనిస్తే చక్కగా నీరు పైకి తేలుతుంది.
నీరు వదిలిన బీరకాయ ముక్కల్లో పసుపు కారం బాదాం ముద్దా వేసి కలిపి 1/2 కప్పు నీరు పోసి దగ్గరగా ఉడకనివ్వండి.
దాల్చిన చెక్క లవంగాలు మెత్తని పొడి చేసి దగ్గరపడ్డ బీరకాయ బాదాం పాలు కూరలో చల్లుకోండి.
ఆ పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి దింపేసుకోండి. కూరని మరీ దగ్గర ఉడికిస్తే చల్లారిన తరువాత ఇంకా దగ్గరపడి ముద్దగా అయిపోతుంది.