వేపిన పల్లీలు కొబ్బరి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ పసుపు వేసి తాలింపు పెట్టుకోండి.
ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడే దాకా వేగనివ్వాలి
వేగిన ఉల్లిపాయాలో ధనియాల పొడి, ఉప్పు, కారం కొద్దిగా నీళ్ళు వేసి నూనె పైకి తెలనిచ్చే దాకా వేపుకోవాలి.
తరువాత బీరకాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. బీరకాయ మెత్తబడ్డాక నీళ్ళు పల్లీలు కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో 8-10 నిమిషాలు ఉడకనివ్వాలి.