సగ్గుబియ్యం మురుకులు

Snacks | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 25 Mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup సగ్గుబియ్యం
  • 3 cups బియ్యం పిండి
  • ఉప్పు
  • 1/4 tsp ఇంగువ
  • 2 tbsp అల్లం పచ్చిమిర్చి పేస్ట్ (3 పచ్చిమిర్చి ½ అంగుళం అల్లంతో రుబ్బిన పేస్ట్)
  • 1 tsp జీలకర్ర
  • 2 tbsp వేడి నూనె
  • మజ్జిగ – పిండిని మెత్తగా తడుపుకోవడానికి
  • నిమ్మరసం – ½ చెక్క
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. సగ్గుబియ్యంలో నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టాలి. నాలుగు గంటల తరువాత నీళ్ళతో సగ్గుబియ్యాన్ని బరకగా అంటే 40% పలుకుగా 60% గుజ్జుగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. బియ్యం పిండిలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి పిండిని మృదువుగా మజ్జిగతో తడుపుకోవాలి
  3. కారప్పూస గిద్దలో స్టార్ ప్లేట్ ఉంచి నూనె రాసి అందులో పిండి ముద్ద ఉంచుకోండి.
  4. నూనె రాసిన గరిట లేదా అరిటాకు మీద చక్రాల చుట్టుకొని ఒక అంచుని లోపలికి మడవాలి. లేదా కారప్పూసలా కూడా వత్తుకోవచ్చు.
  5. వత్తుకున్న మురుకులని బాగా వేడెక్కిన నూనెలో మంట పూర్తిగా తగ్గించి మురుకులు అన్నీ వేసి మీడియం మీద వేగనిచ్చి, బుడగలు తగ్గాక ఒక నిమిషం హై-ఫ్లేమ్ మీద వేపి తీసుకోండి.
  6. పూర్తిగా చల్లారిన మురుకులని గాలి చొరని డబ్బాలో ఉంచితే కనీసం 15 రోజులు పైన తాజాగా ఉంటాయ్.