సగ్గుబియ్యంలో నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టాలి. నాలుగు గంటల తరువాత నీళ్ళతో సగ్గుబియ్యాన్ని బరకగా అంటే 40% పలుకుగా 60% గుజ్జుగా గ్రైండ్ చేసుకోవాలి.
బియ్యం పిండిలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి పిండిని మృదువుగా మజ్జిగతో తడుపుకోవాలి
కారప్పూస గిద్దలో స్టార్ ప్లేట్ ఉంచి నూనె రాసి అందులో పిండి ముద్ద ఉంచుకోండి.
నూనె రాసిన గరిట లేదా అరిటాకు మీద చక్రాల చుట్టుకొని ఒక అంచుని లోపలికి మడవాలి. లేదా కారప్పూసలా కూడా వత్తుకోవచ్చు.
వత్తుకున్న మురుకులని బాగా వేడెక్కిన నూనెలో మంట పూర్తిగా తగ్గించి మురుకులు అన్నీ వేసి మీడియం మీద వేగనిచ్చి, బుడగలు తగ్గాక ఒక నిమిషం హై-ఫ్లేమ్ మీద వేపి తీసుకోండి.
పూర్తిగా చల్లారిన మురుకులని గాలి చొరని డబ్బాలో ఉంచితే కనీసం 15 రోజులు పైన తాజాగా ఉంటాయ్.