పాన్లో నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆఖరున పచ్చిమిర్చి వేసి 30 సెకన్లు మాత్రమే వేపుకోవాలి
వేపుకున్న తాళింపులో రుబ్బుకున్న బియ్యం పిండి ఉప్పు వేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడే దాకా కలిపి దింపేసుకోవాలి
దింపుకున్న పిండి ముద్దలో కొబ్బరి పలుకులు వేసి వేడి మీదే చేతులకి నూనె రాసుకుని చేతి మణికట్టుతో బాగా వత్తుకోవాలి. వత్తుకున్న పిండిని నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి
చేసుకున్న ఉండలని ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
ఈ ఉండలు వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటాయ్.