మిగిలిన నెయ్యి వేసి ఖర్జూరం పిస్తా పలుకులు కాస్త వేపుకోండి. కొద్దిగా వేగిన ఖర్జూరంలో ద్రాక్ష, బాదాం పలుకులు వేసి ఎర్రగా వేపి వేపుకున్న సేమియాలో వేసుకోండి
చిక్కని పాలల్లో పావు కప్పు నీళ్లు పోసి రెండు పొంగులు రానిచ్చి దింపేసుకోండి
మిగిలిన లీటర్ నీళ్లు మరిగించి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మరిగించాలి.
సగ్గుబియ్యం రంగు మారాక పంచదార పటికబెల్లం యాలకుల పొడి వేసి మరించండి
పంచదార కరిగాక వేపుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ వేసి 2 నిమిషాలు మరిగించుకోండి
రెండు నిమిషాలకి సేమియా కాస్త మెత్తబడుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి కాచుకుని ఉంచుకున్న పాలు పోసి కలుపుకోండి, ఇంకా నచ్చితే చిన్న ఉప్పు పలుకు వేసి కలుపుకోండి. ఈ తీరులో చేసే పాయసం మీకు గట్టిపడదు, ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది.