1 ½
cups చిట్టిముత్యాల బియ్యం (ఒక గంట నానబెట్టిsoaked for one hour)
1
Bunch పుదీనా
1
Bunch కొత్తిమీర
1
tbsp నిమ్మరసం
3
cups వేడి నీళ్లు
విధానం
నూనె వేడి చేసి అందులో మసాలా దినుసులు జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి
వేగిన మసాలాల్లో పచ్చి మిర్చి,ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి
వేగిన ఉల్లిపాయల్లో కాయకూర ముక్కలు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి మూతపెట్టి 4 నిమిషాలు వేపితే సగం పైన మగ్గుతాయ్
4. మగ్గిన కాయకూరల్లో పెరుగు, కాస్త కొత్తిమీర పుదీనా కారం వేసి పెరుగు కూరలో కలిసిపోయేదాకా వేపుకోండి
ఇప్పుడు తరిగిన టమాటో ముక్కలు వేసి కలిపి మరిగే వేడి నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద ఎసరుని తెరలా కాగనివ్వాలి.
మరుగుతున్న ఎసరులో గంటసేపు నానుతున్న చిట్టిముత్యాల బియ్యం కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు వేసి మెతుకు చిదరకుండా నెమ్మదిగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7-8 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత నెమ్మదిగా ఒక్క సారి కలిపి బిర్యానీ పూర్తిగా ఉడకనివ్వండి.
బిర్యానీ పూర్తిగా తయారవ్వగానే స్టవ్ ఆపేసి 15 నిమిషాలు వదిలేస్తే అన్నం గుంజుకుని పొడిపొడిగా అవుతుంది.
ఈ బిర్యానీ చల్లని ఉల్లి రైతాతో చాలా రుచిగా ఉంటుంది.