మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి (మరో విధానం కోసం టిప్స్ చుడండి).
సొయాని 30 నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టినవి గట్టిగా పిండి నీరు తీసేయండి.
ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి సొయా వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపి తీసుకోండి.
మిగిలిన నూనె వేసి అల్లం వెల్లులి పేస్ట్ వేసి ఎర్రగా వేపుకోవాలి.
వేగిన అల్లం వెల్లులి ముద్దలో ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
నూనె పైకి తేలాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ టమాటో పేస్ట్ వేసి టమాటోల్లోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
టొమాటోలు మగ్గి నూనె పైకి తేలిన తరువాత చింతపండు పులుసు పోసి ఒక నిమిషం ఉడకనివ్వాలి.
తరువాత వేపిన సొయా, తగినన్ని నీళ్లు పోసి కలిపి మూతపెట్టి నూనె పైకి తేలి గ్రేవీ చిక్కబడే దాకా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి.
కుర్మలోంచి నూనె పైకి తేలాక కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. ఈ కర్రీ వేడి అన్నం, చపాతీతో చాలా రుచిగా ఉంటుంది. (రెసిపీ గురుంచి మరిన్ని వివరాల కోసం పైన ఉన్న టిప్స్ చుడండి).