100 -125
ml చింతపండు పులుసు (50gm చింతపండు నుండి తీసినది)
1/2
liter నీళ్లు
విధానం
పులుసులు కారం పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఆవాలు చిట్లి మెంతులు ఎర్రబడేదాకా వేపి మెత్తని పొడి చేసుకోండి.
నూనె వేడి చేసి ఆవాలు వేసి చితాలనివ్వాలి ఆ తరువాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లులి కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద.
వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు ఉప్పు వేసి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి.
తరువాత కారం, ధనియాల పొడి వేసి వేపి చింతపండు పులుసు పొడి ఒక పొంగు రానివ్వాలి.
పొంగుతున్న పులుసులో చిలకడదుంపల ముక్కలు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 30 నిమిషాలు వదిలేయాలి. ఇంకా కాస్త బెల్లం గడ్డ కూడా వేసుకోండి (ఇది పులుసు తియ్యగా ఇష్టపడే వారికి).
దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి. ఈ పులుసు వేడి అన్నం నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.