చింతపండుని వేడి నీటిలో నానా బెట్టి 250ml చింతపండు పులుసు తీయండి.
బియ్యాన్ని కడిగి కప్ కి రెండు కప్పుల నీళ్ళు పోసి మూడు విసిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి.
ఆవిరి పోయాక వేడి మీదే పసుపు, నూనె, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు ఉప్పు వేసి నిదానంగా పట్టించి చల్లారనివ్వండి.
ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, అల్లం వేసి మెత్తగా పేస్టు చేసుకోండి(గ్రైండ్ చేసే ముందు టిప్స్ చూడండి).
2 tsps నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రగా వేపుకోండి, తరువాత కరివేపాకు వేసి వేపుకోండి.
తరువాత చింతపండు పులుసు పోసి అందులో బెల్లం తరుగు వేసి పులుసు చిక్కటి గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోండి.
చింతపండు పులుసు చిక్కగా అయ్యాక ఆవాల పేస్టు వేసి ఓ ఉడుకు రానివ్వండి, ఓ ఉడుకు వచ్చాకా స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే అన్నాన్ని వేసి బాగా పట్టించండి.
రెండో తాలిమ్పుకి ¼ కప్ నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటమనిపించి వేరుసెనగపప్పులు వేసి ఎర్రగా వేపి తరువాత సెనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి.
ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలు వేసి వేపుకుని పులిహోరలో వేసి కలుపుకోండి అంతే ప్రసాదం పులిహోరా తయార్.