చేప ముక్కలకి పసుపు ఉప్పు అల్లం వెల్లులి పట్టించి కాసేపు పక్కనుంచండి( నా దగ్గర వేపియాన్ అల్లం వెల్లులి ముద్ద ఉంది అందుకే ముందే వేసాను మీరు నూనెలో వేపుకోండి)
చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకోండి.
పులుసు పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. ఆఖరుకి స్టవ్ ఆపేసి గసగసాలు వేస్తే ఆ వేడి చిట్లుతాయ్
వేగిన మసాలా దినుసులని చల్లార్చి మెత్తని పొడి చేసి పక్కనుంచుకొండి
ఉల్లిపాయల్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ అన్ని వైపులా మెత్తబడే దాకా కాల్చుకోండి. కాలిన ఉల్లిపాయని తీసి పైన నల్లని పొట్టుని తీసి మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి
చిక్కని చింత గుజ్జులో ఉల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకొండి
నూనె వేడి చేసి అందులో కరివేపాకు తరుగు దాల్చిన చెక్క ముక్క వేసి వేపుకోండి. (ఇక్కడే అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి)
వేగిన తాలింపులో కలిపి ఉంచుకున్న ఉల్లి చింత గుజ్జు వేసి ముందు నీరు వేయకుండా కలుపుతూ నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి
పులుసులోంచి నూనె పైకి తేలిన తరువాత పులుసు పొడి వేడి నీళ్లు లీటర్ పోసి హై ఫ్లేమ్ మీద పులుసుని 5 నిమిషాలు మరగనివ్వాలి.
పులుసు బాగా మరిగిన తరువాత చేప ముక్కలు సర్ది మూత పెట్టి నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి (మధ్యలో చేప ముక్కలని గరిటతో కడపకండి విరిగిపోతాయి)
నాకు 25 నిమిషాలకి నూనె పైకి తేలింది. అప్పడు కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపి కనీసం గంట సేపైనా ఊరనివ్వాలి ముక్కలని. రాత్రంతా పులుసు వదిలేస్తే ఇంకా రుచిగా ఉంటుంది చేపల పులుసు.